ఖుషి నిర్మాతతో పవన్ కల్యాణ్ సినిమా

పవన్ కల్యాణ్ కు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టిన చిత్రం ఖుషి. సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎమ్ రత్నం నిర్మించాడు ఈ సినిమాని. ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తాజాగా మరోసారి ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవన్ నటిస్తాడనే వార్తలొచ్చినప్పటికీ వాటిని పవన్ వర్గీయులు ఖండించారు. అయితే ఖుషీ నిర్మాత మాత్రం పవన్ తో సినిమాకు రెడీ అయిపోతున్నాడు. తమిళ్ లో హిట్టయిన వేదాలమ్ సినిమాను తెలుగులో […]

Advertisement
Update: 2016-02-08 04:47 GMT
పవన్ కల్యాణ్ కు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టిన చిత్రం ఖుషి. సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎమ్ రత్నం నిర్మించాడు ఈ సినిమాని. ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తాజాగా మరోసారి ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవన్ నటిస్తాడనే వార్తలొచ్చినప్పటికీ వాటిని పవన్ వర్గీయులు ఖండించారు. అయితే ఖుషీ నిర్మాత మాత్రం పవన్ తో సినిమాకు రెడీ అయిపోతున్నాడు. తమిళ్ లో హిట్టయిన వేదాలమ్ సినిమాను తెలుగులో పవన్ తో నిర్మించడానికి ఎస్ జే సూర్య సిద్ధమౌతున్నాడు. సూర్య మూవీస్ బ్యానర్ పై నటించడానికి పవన్ కూడా ఓకే చెప్పాడు. ఇదే సినిమాను తెలుగులో సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తాడంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను ఎస్ జే సూర్య మాత్రం ఖండిస్తున్నాడు. వేదాలమ్ రీమేక్ కు సంబంధించి ప్రస్తుతం నలుగురు దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వాళ్లలో ఎవరికి మెగాఫోన్ అప్పగించాలనే అంశాన్ని పవన్ నిర్ణయిస్తారని రత్నం ప్రకటించాడు. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్… ఆ సినిమా విడుదలైన వెంటనే…. తన కొత్త దర్శకుడు ఎవరనే విషయాన్ని ప్రకటిస్తాడు.
Tags:    
Advertisement

Similar News