ఒకేసారి పాతిక మందిని పీకేసిన పూరీ

పూరి జగన్నాధ్ ఏం చేసినా సంచలనమే. తాజాగా తన ఆఫీస్ నుంచి ఏకంగా పాతిక మందిని బయటకు గెంటేశాడు పూరి. దీంతో ఇండస్ట్రీ మొత్తం అవాక్కయింది. సాధారణంగా దర్శకుడి దగ్గర పనిచేసే స్టాఫ్ లో ఒకరిద్దరు మానేయడం… లేదా దర్శకుడే ఒకరిద్దర్ని తొలిగించడం సర్వసాధారణం. కానీ ఒకేసారి 25 మందిపై వేటువేయడం మాత్రం ఇండస్ట్రీలో ఇదే తొలిసారి కావొచ్చు. దీనికి పూరి జగన్నాధ్ దగ్గర తిరుగులేని సమాధానం కూడా ఉంది. చాలా ఏళ్లుగా ఆ పాతిక మంది […]

Advertisement
Update: 2016-01-09 19:00 GMT
పూరి జగన్నాధ్ ఏం చేసినా సంచలనమే. తాజాగా తన ఆఫీస్ నుంచి ఏకంగా పాతిక మందిని బయటకు గెంటేశాడు పూరి. దీంతో ఇండస్ట్రీ మొత్తం అవాక్కయింది. సాధారణంగా దర్శకుడి దగ్గర పనిచేసే స్టాఫ్ లో ఒకరిద్దరు మానేయడం… లేదా దర్శకుడే ఒకరిద్దర్ని తొలిగించడం సర్వసాధారణం. కానీ ఒకేసారి 25 మందిపై వేటువేయడం మాత్రం ఇండస్ట్రీలో ఇదే తొలిసారి కావొచ్చు. దీనికి పూరి జగన్నాధ్ దగ్గర తిరుగులేని సమాధానం కూడా ఉంది. చాలా ఏళ్లుగా ఆ పాతిక మంది తన దగ్గర పనిచేస్తున్నారని… ఈమధ్య కాలంలో వాళ్లంతా చెప్పిన పని వినడం లేదని ఆరోపిస్తున్నాడు పూరి. అంతేకాదు… పనితీరు సరిగ్గా లేదని, టీంగా కలిసి పనిచేయడం లేదని రెండేళ్ల నుంచి సిబ్బందిని హెచ్చరిసూనే ఉన్నానని… తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు తొలిగించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. అయితే ఒకేసారి 25 మందిని తీసేయడంతో… ప్రస్తుతం పూరీ చేస్తున్న రోగ్ సినిమాపై ఆ ప్రభావం పడింది. సిబ్బంది లేకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఈ సమస్య నుంచి త్వరలోనే గట్టెక్కుతానంటున్నాడు పూరి జగన్నాధ్.
Tags:    
Advertisement

Similar News