అమరావతిపై మోజుపడ్డ మోత్కుపల్లి

టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ రాజధాని అమరావతిపై మనసు పారేసుకున్నారు. ఏకంగా అమరావతిలోనే సెటిల్‌ అయిపోయేందుకు ప్లాన్ చేశారు. తన కోరికను   ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే విన్నవించుకున్నారు. తాను టీడీపీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎంపికైనందున… కేంద్ర నాయకుడి(చంద్రబాబు)కి దగ్గరగా ఉండడమే అన్ని విధాలుగా మంచిదని చెప్పారు. కాబట్టి అమరావతిలో తనకో ఇల్లు ఇవ్వాలని  పార్టీ అధినేతను కోరారు.   మోత్కుపల్లి వ్యాఖ్యలకు చంద్రబాబు రివర్స్‌ పంచ్‌ వేశారు. రాజధానిలో నేతలకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని […]

Advertisement
Update: 2015-11-07 16:35 GMT

టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ రాజధాని అమరావతిపై మనసు పారేసుకున్నారు. ఏకంగా అమరావతిలోనే సెటిల్‌ అయిపోయేందుకు ప్లాన్ చేశారు. తన కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే విన్నవించుకున్నారు. తాను టీడీపీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎంపికైనందున… కేంద్ర నాయకుడి(చంద్రబాబు)కి దగ్గరగా ఉండడమే అన్ని విధాలుగా మంచిదని చెప్పారు. కాబట్టి అమరావతిలో తనకో ఇల్లు ఇవ్వాలని పార్టీ అధినేతను కోరారు.

మోత్కుపల్లి వ్యాఖ్యలకు చంద్రబాబు రివర్స్‌ పంచ్‌ వేశారు. రాజధానిలో నేతలకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇంకా మొదలుపెట్టలేదన్నారు.” మీలో ఇంకా శక్తిసామర్థ్యాలున్నాయి. మీ సేవలు తెలంగాణకు అవసరం. ఒకవేళ మీకు ప్రమోషన్ వస్తే ఢిల్లీకి పంపిస్తాం. అంతేకాని అమరావతికి కాదు” అంటూ మోత్కుపల్లి కోరికపై చంద్రబాబు నీళ్లు చల్లారు. చంద్రబాబు రియాక్షన్‌తో మోత్కుపల్లి మౌనంగా ఉండిపోయారు. టీటీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది..

Tags:    
Advertisement

Similar News