మీడియా ప్రతినిధులను కొట్టిన పవన్ సెక్యూరిటీ

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. అమరావతి శంకుస్థాపనకు పవన్‌ను ఆహ్వానించేందుకు మంత్రులు కామినేని, అయన్నపాత్రుడు నానక్‌రాంగూడలోని రామనాయుడు స్టూడియోకు వెళ్లారు. దీన్ని కవరేజ్ చేయడానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. అక్కడే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్‌లో పవన్ బిజీగా ఉన్నారు. అయితే పవన్ దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన మీడియాపై ఆయన సెక్యూరిటీ సిబ్బంది విరుచుకుపడ్డారు . కెమెరామెన్లపై పిడిగుద్దులు గుద్దారు. దీంతో పలువురు కెమెరామెన్లు గాయపడ్డారు. రెండు […]

Advertisement
Update: 2015-10-16 13:08 GMT

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. అమరావతి శంకుస్థాపనకు పవన్‌ను ఆహ్వానించేందుకు మంత్రులు కామినేని, అయన్నపాత్రుడు నానక్‌రాంగూడలోని రామనాయుడు స్టూడియోకు వెళ్లారు. దీన్ని కవరేజ్ చేయడానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు.

అక్కడే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్‌లో పవన్ బిజీగా ఉన్నారు. అయితే పవన్ దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన మీడియాపై ఆయన సెక్యూరిటీ సిబ్బంది విరుచుకుపడ్డారు . కెమెరామెన్లపై పిడిగుద్దులు గుద్దారు. దీంతో పలువురు కెమెరామెన్లు గాయపడ్డారు. రెండు కెమెరాలు ధ్వంసమయ్యాయి. పవన్ బౌన్సర్ల దాడిని మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. రామానాయుడు స్డూడియో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాడిపై పవన్ స్పందించాలని డిమాండ్ చేశారు. దీంతో మీడియా ప్రతినిధులకు పవన్ క్షమాపణ చెప్పారు.

Advertisement

Similar News