చంపి.. మక్కలు చేసి పారేశాడు..!
కట్టుకుంటానని కట్టుకథలు చెప్పి… రెండేళ్లు సహజీనం చేసి తీరా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన మహిళను ఓ వ్యక్తి దారునంగా హత్య చేశాడు. కత్తితో నరికి..ముక్కలు చేసి.. వాటిని నగరంలో పలుచోట్ల పారేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విజయవాడకు చెందిన విజయ్బాబు (40) బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్లో నివాసముంటూ నందినగర్లోని ఓ బిల్డర్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రాజమండ్రికి చెందిన వేపూరి రమణకుమారి(35)తో ఇందిరానగర్లో గది అద్దెకు తీసుకుని రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. కొంతకాలంగా […]
Advertisement
కట్టుకుంటానని కట్టుకథలు చెప్పి… రెండేళ్లు సహజీనం చేసి తీరా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన మహిళను ఓ వ్యక్తి దారునంగా హత్య చేశాడు. కత్తితో నరికి..ముక్కలు చేసి.. వాటిని నగరంలో పలుచోట్ల పారేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
విజయవాడకు చెందిన విజయ్బాబు (40) బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్లో నివాసముంటూ నందినగర్లోని ఓ బిల్డర్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రాజమండ్రికి చెందిన వేపూరి రమణకుమారి(35)తో ఇందిరానగర్లో గది అద్దెకు తీసుకుని రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. కొంతకాలంగా పెళ్లి చేసుకోమని రమణ ఒత్తిడి తేవడంతో విజయ్ తప్పించుకు తిరిగాడు. దీంతో బాధితురాలు రమణ రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు విజయ్కు కౌన్సెలింగ్ ఇవ్వడంతో.. వివాహానికి అంగీకరించాడు.కానీ, అప్పటికే అతని బార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆగస్టు 3న విజయ్ మాటలు నమ్మి హైదరాబాద్ వచ్చింది రమణి. నగరానికి వచ్చాక ఇద్దరి మధ్య పెళ్లి విషయంలో గొడవ జరిగింది. దీంతో మాంసం కత్తితో రమణను నరికి చంపాడు విజయ్. శరీరాన్ని ముక్కలు చేసి, వాటిని సూట్కేసులో కుక్కాడు. మాదాపూర్ సమీపంలోని గుట్టల బేగంపేటలో, రహ్మత్నగర్ సమీపంలోని జానకమ్మ తోటలో పడేశాడు. రమణ రెండునెలలుగా కనిపించకపోవడంతో ఆమె అక్క విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు రంగంలోకి దిగి విజయ్ను ప్రశ్నించగా దారుణం వెలుగుచూసింది. పోలీసు బృందాలకు రమణ శరీరం భాగాలు లభించలేదు. కేసు విచారణలో ఉంది.
Advertisement