మరోసారి భారతీయుడు జోడీ

     భారతీయుడు సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై కలుసుకోలేదు కమల్ హాసన్, మనీషా కొయిరాలా. మళ్లీ ఇన్నాళ్లకు ఆ భారతీయుడు జోడీ కనువిందు చేయబోతోంది. లోకనాయకుడి కొత్త సినిమాలో మనీషా కొయిరాలా మెరవనుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఇప్పటికే త్రిషను ఒక హీరోయిన్ గా సెలక్ట్ చేశారు. ఇప్పుడు సెకెండ్ హీరోయిన్ గా మనీషాను ఎంపిక చేశారు. జేమ్స్ బాండ్ తరహా కథతో రాబోతున్న ఈ సినిమాలో కమల్ గర్ల్ […]

Advertisement
Update: 2015-05-14 00:24 GMT
భారతీయుడు సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై కలుసుకోలేదు కమల్ హాసన్, మనీషా కొయిరాలా. మళ్లీ ఇన్నాళ్లకు ఆ భారతీయుడు జోడీ కనువిందు చేయబోతోంది. లోకనాయకుడి కొత్త సినిమాలో మనీషా కొయిరాలా మెరవనుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఇప్పటికే త్రిషను ఒక హీరోయిన్ గా సెలక్ట్ చేశారు. ఇప్పుడు సెకెండ్ హీరోయిన్ గా మనీషాను ఎంపిక చేశారు. జేమ్స్ బాండ్ తరహా కథతో రాబోతున్న ఈ సినిమాలో కమల్ గర్ల్ ఫ్రెండ్ గా త్రిష కనిపిస్తే.. కమల్ భార్యగా మనీషా కొయిరాలా కనిపించనుంది. క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న మనీషా, ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలపై దృష్టిపెట్టింది. సెకెండ్ ఇన్నింగ్స్ లో మెరవాలనుకుంటోంది. అందుకే తనకు తెలిసిన సినీమిత్రులందరికీ ఫోన్లు చేసింది. అయితే ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనీషాకు ఆఫర్ ఇచ్చి ఆదుకున్నాడు కమల్ హాసన్. ఫ్రెండ్ షిఫ్ కు విలువిచ్చే కమల్, మరోసారి తన పెద్దమనసును ఇలా చాటుకున్నాడు.
Tags:    
Advertisement

Similar News