Telugu Global
Andhra Pradesh

ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క‌లిసి న‌డ‌వ‌నున్న హీరోయిన్ !

పవన్ కళ్యాణ్ తో కలిసి నడిస్తానని నటి నికీషా పటేల్ ప్రకటించారు. విశాఖలో పవన్ ను హోటల్ నుంచి పోలీసులు బైటికి రానీయకపోవడంతో తాను వాకింగ్ కోసం రావచ్చా అని ప్రశ్నించారు పవన్. దానికి స్పందించిన‌ నికీషా తాను కూడా కలిసి నడుస్తానని ట్వీట్ చేశారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క‌లిసి న‌డ‌వ‌నున్న హీరోయిన్ !
X

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ ప‌ర్య‌ట‌న తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. ఈ ప‌రిస్థితుల నేపథ్యంలో ఆయన‌ బ‌స చేస్తున్న హోట‌ల్ లోనే ఉండాల‌ని పోలీసులు ఆంక్ష‌లు విధించారు. దీంతో ఆయ‌న నిర్వ‌హించాల్సిన జ‌న‌వాణి కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేసుకున్నారు. అక్క‌డే ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో చ‌ర్చిస్తున్నారు. ఈ సంద‌ర్భంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఒక హీరోయిన్ నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. ఆయ‌న‌తో క‌లిసి తానూ 'న‌డుస్తానంటూ' ట్వీట్ చేసింది.

వందలాది మంది పోలీసులు హోటల్ వద్ద మోహరించారు. చాలా మంది జనసేన నాయకులు, కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. దీనితో జనసేన కార్యకర్తలు నోవొటెల్ వద్ద చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

పోలీసులు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వ తీరును విమ‌ర్శిస్తూ ప‌వన్ వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో.. "నేను సాయంత్రం ఆర్కే బీచ్ లో మంచి గాలి పీల్చుకోవడానికి వాకింగ్ చేయవచ్చా " అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ కి కొమరం పులి హీరోయిన్ నికీషా పటేల్ స్పందించింది. 'నేనూ నీ వెంట నడుస్తా' అంటూ నికీషా పవన్ ట్వీట్ కి రిప్లై ఇవ్వడం వైరల్ గా మారింది. కేవలం పవన్ కళ్యాణ్ తో కలసి ఒక్క చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకుంది నికీషా పటేల్.. పాలిటిక్స్ తో ఏ సంబంధం లేకున్నా ఆయనకి సపోర్ట్ గా నిలిచింది.

కాగా, ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రి కొద్ది సేప‌ట్లో విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేర‌నున్నారు. ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ ను క‌లుసుకోవాల‌ని భావించారు. అయితే ఇంకా ఆయ‌న‌కు అప్పాయింట్ మెంట్ రాక‌పోవ‌డంతో ఆయ‌న నేరుగా మంగ‌ళ‌గిరి జ‌న‌సేన కార్యాల‌యానికి చేరుకుంటార‌ని చెబుతున్నారు.


First Published:  17 Oct 2022 10:20 AM GMT
Next Story