Hyderabad: మెడికల్ సీటు పేరుతో మోసం... బీజేపీ నేత అరెస్ట్

మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ కొత్తపల్లి సతీష్ కుమార్ అనే బీజేపీ నేత ఓ వ్యక్తిని మోసం చేశాడు. బాధితుడి వద్ద నుంచి బీజేపీ నేత 48 లక్షల రూపాయలు వసూలు చేశాడు. సతీష్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
Update: 2022-09-20 15:02 GMT

మెడికల్ సీటు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి 48 లక్షల‌ రూపాయలు వసూలు చేసి మోసం చేసిన బీజేపీ నాయకుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

గతంలో జనగాం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కొత్తపల్లి సతీష్ కుమార్ అనే బీజేపీ నాయకుడు ఓ వ్యక్తికి మెడిక‌ల్ సీటు ఇప్పిస్తాన‌ని చెప్పి రూ. 48 ల‌క్ష‌లు వ‌సూలు చేశాడు. సీటు ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. పైగా తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు. దాంతో బాధితుడు హైదరాబాద్ లోని సీసీఎస్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు బీజెపి నేత‌ స‌తీశ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజ‌రు ప‌రిచారు.

Tags:    
Advertisement

Similar News