HCA మరో బిగ్ మిస్టేక్

ఈ రోజు హైదరాబాద్ లో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. 6.30 కే టాస్ వేయనున్నారు. అయితే టిక్కట్లపై 7.30 కి మొదలవుతుందని ముద్రించింది HCA.

Advertisement
Update: 2022-09-25 10:31 GMT

హైదరాబాద్ లో ఈ రోజు జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ విషయంలో అనేక వివాదాలు రేగుతున్నాయి. HCA టికెట్ల విక్రయం నుంచి మ్యాచ్ ఏర్పాట్ల వరకూ అన్నింటా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది.

టిక్క‌ట్లు బ్లాక్ లో అమ్మినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న HCA దాదాపు 12,500 టికెట్లు ఏం చేశారో, ఎవరికి అమ్మారో అనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఇంకోవైపు మ్యాచ్ కు సమయం దగ్గర పడుతున్నా స్టేడియంలో ఏర్పాట్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారన్న విమర్శలూ ఉన్నాయి. ఉప్పల్ స్టేడియంలో దుమ్మూ, దూళి, పక్షుల వ్యర్థాలతో నిండిన సీట్లను సరిగ్గా శుభ్రం చేయలేదంటూ సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో HCA అమ్మిన టిక్కట్లపై మ్యాచ్ టైమింగ్ ను కూడా తప్పుగా ముద్రించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. టాస్ గం. 6.30కే వేస్తారు. కానీ, టికెట్లపై మ్యాచ్ గం. 7.30కు మొదలవుతుందని ముద్రించింది.

అదే మీడియాకు పంపించిన ప్రెస్ నోట్ లో మాత్రం మ్యాచ్ 7 గంటలకే మొదలవుతుందని చెప్పింది. ఈ విషయంపై HCA అధికారులను మీడియా సంప్రదించగా స్పందించడానికి నిరాకరించారు. 

Tags:    
Advertisement

Similar News