తెలంగాణ ప్రభుత్వంలో చేరికకు సీపీఐ సుముఖం!

తెలంగాణ ప్రభుత్వంలో చేరిక అంశంపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఇంకా తమకు పొత్తులో భాగంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు రావాల్సి ఉందని ఆయన గుర్తుచేశారు.

Advertisement
Update: 2023-12-05 09:35 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్న సీపీఐ.. కొత్తగూడెం స్థానం నుంచి పోటీచేసిన విషయం తెలిసిందే. సీపీఐకి ఒక సీటు కేటాయించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో పొత్తుకు సిద్ధమై బరిలోకి దిగిన సీపీఐ కొత్తగూడెంలో విజయం సాధించింది.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆ పార్టీ తరఫున కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీకి దిగగా, కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో చేరిక అంశంపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఇంకా తమకు పొత్తులో భాగంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు రావాల్సి ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో చేరికకు సీపీఐ సిద్ధంగా ఉందని అర్థమవుతోంది. సీపీఐ తరఫున గెలుపొందిన కూనంనేని సాంబశివరావు కూడా ఈ సమావేశంలో మాట్లాడారు.

Tags:    
Advertisement

Similar News