అర్వింద్ బాటలో కాంగ్రెస్ అభ్యర్థులు.. బాండ్ పేపర్లు.!

ప్రజలకు విశ్వాసం కలిగించేందుకే బాండ్ పేపర్‌ రాసిస్తున్నానని చెప్పారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని బాండ్ పేపర్‌లో రాశారు.

Advertisement
Update: 2023-11-27 11:57 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ పోలింగ్‌ గడువు ద‌గ్గ‌ర‌ప‌డింది. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు వినూత్న పద్ధతులు అవలంభిస్తున్నారు. తమకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల‌ను క‌చ్చితంగా అమలు చేస్తామంటూ బాండ్ పేపర్లు రాసిస్తున్నారు. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బాండ్ పేపర్ రాసిచ్చిన లిస్ట్‌లో ఉన్నారు.

ప్రజలకు విశ్వాసం కలిగించేందుకే బాండ్ పేపర్‌ రాసిస్తున్నానని చెప్పారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని బాండ్ పేపర్‌లో రాశారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాన్నారు. అవినీతికి తావు లేకుండా తెలంగాణ ప్రగతికి కృషి చేస్తానన్నారు.


ఇక సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సైతం ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉంటానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ ప్రగతికి కృషి చేస్తానంటూ బాండ్ పేపర్ రాశారు. ఇదే బాటలో మరికొంత మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News