శాంసంగ్ మొబైల్స్‌పై క్రేజీ ఆఫర్స్

బ్లాక్ ఫ్రైడే సేల్స్ పేరుతో శాంసంగ్ తాజాగా భారీ ఆఫర్లు ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లతోపాటు ఇతర గాడ్జెట్స్‌లపై కూడా భారీ డిస్కౌంట్లు ఇస్తోంది.

Advertisement
Update: 2022-11-25 14:00 GMT

శాంసంగ్ మొబైల్స్‌పై క్రేజీ ఆఫర్స్

బ్లాక్ ఫ్రైడే సేల్స్ పేరుతో శాంసంగ్ తాజాగా భారీ ఆఫర్లు ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లతోపాటు ఇతర గాడ్జెట్స్‌లపై కూడా భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శాంసంగ్ సంస్థ నవంబర్ 24 నుంచి 28 వరకు బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ ప్రకటించింది. ఈ నాలుగు రోజులు శాంసంగ్ ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్లు ఆందుబాటులో ఉంటాయి. శాంసంగ్ బ్రాండింగ్‌లో ఫోన్లు ఇతర గాడ్జెట్స్ కొనాలనుకునే వాళ్లకు ఈ సేల్ పై ఓ లుక్కేయొచ్చు.

ఈ సేల్ లో శాసంగ్ గెలాక్సీ ఎస్ 22 మొబైల్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.ఈ మొబైల్ ధర ప్రస్తుతం రూ.85,999 ఉండగా.. సేల్‌లో రూ.62,999కే అందుబాటులో ఉంది. కొన్ని రకాల క్రెడిట్/డెబిట్ కార్డులు, శాంసంగ్ యాప్ వెల్‌కమ్ వౌచర్‌ను ఉపయోగించి అదనంగా మరో రూ.12000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

అలాగే.. గెలాక్సీ ఎస్ 22అల్ట్రా రూ.99,999, గెలాక్సీ జెడ్ ఫ్లిప్4 రూ.80,999లకే అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ రేంజ్‌లో రూ.10వేల లోపు 5జీ మొబైల్ కొనాలనుకునేవాళ్లు గెలాక్సీ ఎం13పై ఓ లుక్కేయొచ్చు. గెలాక్సీ ఎం13 బేస్ వేరియంట్ రూ.9,149కే అందుబాటులో ఉంది.

బడ్జెట్ రేంజ్‌లో గెలాక్సీ ఎం33 5జీ మొబైల్ రూ.14,649కే అందుబాటులో ఉంది. ఇక వీటితోపాటు గెలాక్సీ వాచ్, గెలాక్సీ బడ్స్‌పై కూడా పలు ఆఫర్లున్నాయి. ఈ ఆఫర్లు శాంసంగ్ వెబ్‌సైట్, శాంసంగ్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News