రాజ్యసభకు సుధామూర్తి.. ప్రధాని మోడీ ట్వీట్

సుధామూర్తి కర్ణాటకలో 1950లో జన్మించారు. ఆమె రచయిత్రిగానూ గుర్తింపు పొందారు. అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. 2023లో సుధామూర్తిని పద్మభూషణ్ అవార్డు కూడా వరించింది.

Advertisement
Update: 2024-03-08 08:31 GMT

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ మేర‌కు సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన రావడం విశేషం.

సామాజిక సేవ, విద్య సహా పలు అంశాల్లో సుధామూర్తి స్ఫూర్తిదాయక ముద్ర వేశారని, ఎందరికో ఆదర్శంగా నిలిచారని చెప్పుకొచ్చారు మోడీ. సుధామూర్తి రాజ్యసభలో ఉండటం నారీశక్తికి నిదర్శనమన్నారు మోడీ. సుధామూర్తి తన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తారని ఆశిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు.


సుధామూర్తి కర్ణాటకలో 1950లో జన్మించారు. ఆమె రచయిత్రిగానూ గుర్తింపు పొందారు. అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. 2023లో సుధామూర్తిని పద్మభూషణ్ అవార్డు కూడా వరించింది.

Tags:    
Advertisement

Similar News