చరణ్ నిన్ను చూసి గర్విస్తున్నా.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

ఇటీవల చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు అందుకోగా, తాజాగా రామ్ చరణ్ ఎన్డీటీవీ నుంచి ట్రూ లెజెండ్ అవార్డు అందుకోవడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Update: 2022-12-03 06:44 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్డీటీవీ ట్రూ లెజెండ్ అవార్డు అందుకోవడంపై ఆయన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని అభినందించారు. ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఎన్డీటీవీ వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డులను ఏటా అందజేస్తూ ఉంటుంది. ఈసారి కూడా ఎన్డీటీవీ వివిధ రంగాల్లో సేవలు చేసిన ప్రముఖులను ఎంపిక చేసి అవార్డులను అందజేసింది.

ఈ అవార్డుల్లో భాగంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ విభాగంలో రామ్ చరణ్‌కు ట్రూ లెజెండ్ అవార్డు లభించింది. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం తాజాగా ఎన్డీటీవీ నిర్వహించగా రామ్ చరణ్ అవార్డును స్వీకరించారు. కాగా..చరణ్ అవార్డు పొందడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ట్విట్టర్ వేదికగా తనయుడిని ప్రశంసిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.


'కంగ్రాట్స్ డియర్ చరణ్. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియాలో ట్రూ లెజెండ్ అవార్డు నువ్వు అందుకున్నందుకు గర్విస్తున్నా. నువ్వు ఇలాగే ముందుకు సాగాలని అమ్మ, నేను కోరుకుంటున్నాం.' అని చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి చేసిన ట్వీట్‌కి చరణ్ 'లవ్ యూ అప్పా' అని రిప్లై ఇచ్చాడు.

ఇటీవల చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు అందుకోగా, తాజాగా రామ్ చరణ్ ఎన్డీటీవీ నుంచి ట్రూ లెజెండ్ అవార్డు అందుకోవడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ మూవీలో తన అద్భుతమైన నటనతో రామ్ చరణ్ అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.

Tags:    
Advertisement

Similar News