Aadhi Pinisetty - మరో డిఫరెంట్ సినిమాలో ఆది పినిశెట్టి

Aadhi Pinisetty - నటుడు ఆది పినిశెట్టి మరో కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. శబ్దం అనే సినిమా చేస్తున్నాడు.

Advertisement
Update: 2023-12-15 17:06 GMT

‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ కోసం చేతులు కలిపారు. 7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆది పినిశెట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. నేచురల్ స్టార్ నాని పోస్టర్‌ను లాంచ్ చేశారు. హీరో కొన్ని విచిత్రమైన శబ్దాలను రికార్డ్ చేస్తూ కనిపిస్తుండగా, అనేక పక్షులు ఆకాశంలో ఎగురుతున్నట్టు పోస్టర్ లో చూపించారు. స్పోర్ట్స్ కళ్ళ జోడు ధరించి ఆది స్పాట్‌లో కెమెరా, ఫ్లాష్‌లైట్‌లను గమనించడం ఫస్ట్ లుక్ లో ఆసక్తికరంగా ఉంది. ఈ టెర్రిఫిక్ ఫస్ ట్‌లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

వైశాలి సినిమాకు సంగీతం అందించిన తమన్, ఈ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నాడు. ‘వైశాలి’ లో సౌండ్ తో చాలా ప్రయోగాలు చేశారు. ఈ సినిమాలో కూడా తమన్ అలాంటి ప్రయోగాలు చాలా చేయబోతున్నాడు. ఈ సినిమాలో సౌండ్‌కి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు ఉంటాయి.

ముంబయి, మున్నార్, చెన్నైలోని అనేక ప్రదేశాలలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. కేవలం ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసమే 2 కోట్ల రూపాయల బడ్జెట్‌తో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించారు. సంగీత దర్శకుడు థమన్, ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్ ,ఆర్ఆర్ చేయడానికి హంగేరీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.




Tags:    
Advertisement

Similar News