తారకరత్న కుటుంబీకులకు విజయసాయిరెడ్డి పరామర్శ

బాలకృష్ణ దగ్గర ఉండి తారకరత్నకు అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలుసుకున్న విజయసాయి రెడ్డి బాల‌కృష్ణ‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Update: 2023-02-01 13:26 GMT

సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకర‌త్న గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. బుధవారం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెంగళూరులోని ఆస్పత్రికి వెళ్లి తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి, ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

తారకరత్నకు విజయసాయిరెడ్డి బంధువు అవుతారు. అందువల్లే ఆయన ఆస్ప‌త్రికి వెళ్లి తారకరత్నను పరామర్శించారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి విజయసాయిరెడ్డి పెదనాన్న వరస అవుతారు. విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కూతురే అలేఖ్యరెడ్డి. తార‌క‌ర‌త్న బంధువు కావడంతో విజయసాయిరెడ్డి వెళ్లి ఆయనను పరామర్శించారు.

బాలకృష్ణ దగ్గర ఉండి తారకరత్నకు అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలుసుకున్న విజయసాయి రెడ్డి బాల‌కృష్ణ‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంత‌రం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. మెదడులోని పై భాగంలో నీరు చేరి వాపు వచ్చింద‌ని, వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని వైద్యులు చెప్పినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News