సునీల్ దియోధర్ ఇంట్లో విజయసాయి, టీడీపీ ఎంపీ కేశినేని నాని

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ బీజేపీ కో- ఇన్‌చార్జ్‌ సునీల్ దియోధర్ ఇంటికి వెళ్లారు. విజయసాయిరెడ్డితో పాటు టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా దియోధర్ ఇంటికి వెళ్లారు.

Advertisement
Update: 2022-09-07 12:19 GMT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ బీజేపీ కో- ఇన్‌చార్జ్‌ సునీల్ దియోధర్ ఇంటికి వెళ్లారు. దియోధర్ ఆహ్వానం మేరకే విజయసాయిరెడ్డి వెళ్లారు. తన ఇంట్లో ఏర్పాటు చేసిన వినాయకుడికి పూజ సందర్బంగా తనకు పరిచయస్తులైన నేతలను సునీల్ దియోధర్ ఆహ్వానించారు. విజయసాయిరెడ్డితో పాటు టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా దియోధర్ ఇంటికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. విజయసాయిరెడ్డికి దియోధర్ కుటుంబసభ్యులు సాదరస్వాగతం పలికారు.



రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా వ్యక్తిగతంగా అన్ని పార్టీల నేతలతోనూ ఢిల్లీలో విజయసాయిరెడ్డి మంచి వ్యక్తిగత సంబంధాలు నడుపుతుంటారు. అందుకే చాలా మంది పార్టీలకతీతంగా విజయసాయిరెడ్డి పట్ల సానుకూలత చూపుతుంటారు. ఏపీలో వైసీపీ- బీజేపీ నేతల మధ్య నిత్యం విమర్శలు, ప్రతివిమర్శలు నడుస్తున్నప్పటికీ సునీల్ దియోధర్ విజయసాయిరెడ్డిని తన ఇంటికి ఆహ్వానించడం అందరి దృష్టిని ఆకర్శించింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని వెళ్లడమూ టీడీపీలో చర్చనీయాంశమైంది.

Tags:    
Advertisement

Similar News