ఇంతియాజ్‌ రేప్‌ చేయలేడు.. కావాలంటే ట్రై చేయ్- ఎమ్మెల్సీపై కందికుంట అనుచిత వ్యాఖ్యలు

రెండుసార్లు టికెట్ ఇస్తే, ఓడిపోతే, చివరకు చంద్రబాబు ఎమ్మెల్సీని చేశారని.. ఆ కృతజ్ఞత కూడా లేకుండా వైసీపీలోకి వెళ్లిపోయిన వ్యక్తి పోతుల సునీత అని కందికుంట విమర్శించారు.

Advertisement
Update: 2022-10-10 05:57 GMT

కదిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వైసీపీ మహిళా ప్రజాప్రతినిధులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీడీపీ కార్యకర్త రాళ్లపల్లి ఇంతియాజ్‌ లైంగికంగా వేధించడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నవ్యవహారంపై వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కందికుంట అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పోతుల సునీత.. పదేపదే పచ్చకామాంధులు అని మాట్లాడుతున్నారని.. కామానికి పచ్చ రంగు, బులుగు రంగు అంటూ ఏమీ ఉండదని గుర్తుంచుకోవాలన్నారు.

రెండుసార్లు టికెట్ ఇస్తే, ఓడిపోతే, చివరకు చంద్రబాబు ఎమ్మెల్సీని చేశారని.. ఆ కృతజ్ఞత కూడా లేకుండా వైసీపీలోకి వెళ్లిపోయిన వ్యక్తి పోతుల సునీత అని కందికుంట విమర్శించారు. మహిళల పట్ల టీడీపీ వ్యవహరించే తీరుపై పదేపదే పోతుల సునీత విమర్శలు చేస్తున్నారని.. టీడీపీలో ఉన్నప్పుడు మా టీడీపీ నాయకులు ఆమెను ఏమైనా చేశారా..? అని కందికుంట ప్రశ్నించారు. పోతుల సునీత ఒక శిఖండిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఇంతియాజ్ అనే వ్యక్తికి గంటకోసారి ఫిట్స్ వస్తుంద‌ని.. అతడు నిజంగా రేప్‌ చేసినా ఫిట్స్ వస్తుంద‌ని.. కావాలంటే ఒకసారి ఇంతియాజ్‌తో ట్రై చేయండి అంటూ పోతుల సునీతను ఉద్దేశించి కందికుంట వ్యాఖ్యానించారు. ఇంతియాజ్‌కు ఉరివేయాలంటున్న వారు.. గోరంట్ల మాధవ్‌కు ఎందుకు ఉరి వేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉరిని గోరంట్ల మాధవ్‌కు వేస్తారా లేక అతడు చూపించిన ఐటంకు వేస్తారా అంటూ వెంకటప్రసాద్ మాట్లాడారు.

Tags:    
Advertisement

Similar News