అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఆరుగురు మృతి

గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా తెలియరాలేదు. చనిపోయినవారంతా కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బంధువులని తెలిసింది.

Advertisement
Update: 2023-12-27 10:50 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మర‌ణం చెందారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతిచెందినవారంతా అమలాపురం వాసులుగా గుర్తించారు. టెక్సాస్‌ హైవేలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

జాన్సన్‌ కౌంటీలో ఉన్న 67వ నంబరు హైవేపై మినీ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మినీ వ్యాన్‌లో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్ప‌త్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా తెలియరాలేదు. చనిపోయినవారంతా కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బంధువులని తెలిసింది.

మృతుల్లో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ చిన్నాన్న నాగేశ్వరరావు, పిన్ని సీతామహాలక్ష్మి, కుమార్తె, మనవడు, మనవరాలుతో పాటు మరో బంధువు కూడా ఉన్నారు. నాగేశ్వరరావు అల్లుడు లోకేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరు టెక్సాస్‌ నుంచి డల్లాస్‌ వెళుతుండగా ఈ ప్ర‌మాదం జరిగినట్టు తెలిసింది. ఈ సమాచారం తెలియడంతో అమలాపురంలోని వారి బంధువులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News