భీమ‌వ‌రం టీడీపీ నేతలకు పవన్‌ కల్యాణ్‌ షాక్‌..

ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో మాత్రమే సమావేశం జరిగింది. అనంత‌రం పవన్‌ కల్యాణ్ అర్థాంతరంగా వెళ్లిపోయారు. భీమవరం టీడీపీ నాయకులతో పవన్‌ కల్యాణ్‌ సమావేశం జరగలేదు.

Advertisement
Update: 2024-02-21 14:19 GMT

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భీమవరం టీడీపీ నాయకులకు షాక్‌ ఇచ్చారు. భీమవరం వచ్చిన ఆయన టీడీపీ నాయకులను కలవ‌లేదు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు వివిధ మండ‌లాల నుంచి వ‌చ్చి తమ పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌తో సమావేశం కోసం ఉదయం నుంచి నిరీక్షించారు. కేవలం భీమవరం నియోజకవర్గం నాయకులతోనే అని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సమావేశం ఏర్పాటు చేశారు.

ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో మాత్రమే సమావేశం జరిగింది. అనంత‌రం పవన్‌ కల్యాణ్ అర్థాంతరంగా వెళ్లిపోయారు. భీమవరం టీడీపీ నాయకులతో పవన్‌ కల్యాణ్‌ సమావేశం జరగలేదు. దీంతో టీడీపీ నాయకులు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారికి టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. తమనే కలవకపోతే పవన్‌ కల్యాణ్‌ ప్రజలను ఎలా కలుస్తారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు.

పవన్‌ కల్యాణ్‌ సమావేశం అని చెప్పి తమను ఇక ముందు భీమవరం పిలువొద్దని వీరవాసరం నాయకులు మండిపడ్డారు. మండలాల వారీగా సమావేశాలు పెట్టాలని సూచించారు. దీంతో పార్టీ నాయకులపై పితాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్‌ ఎక్కడ పెట్టాలో చెప్పడానికి మీరెవరంటూ ఆయన మండిపడ్టారు.

Tags:    
Advertisement

Similar News