పవన్ కు విషయం లేదు.. చంద్రబాబుకి మనసు లేదు

పవన్ కల్యాణ్ కి ఎవరిమీదా గౌరవం లేదన్నారు రోజా. కనీసం తల్లి అన్నా కూడా గౌరవం లేదన్నారు. ఉంటే ఆమెను అవమానించినవారి కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకోరని చెప్పారు.

Advertisement
Update: 2023-07-19 09:09 GMT

పవన్ కల్యాణ్ పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి రోజా. సిగ్గులేదు కాబట్టే ఆయన ఎన్డీఏ మీటింగ్ కి వెళ్లారని అన్నారు. అసలాయన ఎందుకు ఆ మీటింగ్ కి వెళ్లారో చెప్పాలన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్ లో నాదెండ్ల మనోహర్ మాట్లాడతారని చెప్పే పవన్, ఎన్డీఏ మీటింగ్ లో మాట్లాడేందుకు తనకు అనుభవం లేదని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి, అలా మాట్లాడటం పవన్ కే సాధ్యమైందని అన్నారు రోజా.

చంద్రబాబు చేసిన అవమానాలన్నీ ప్రధాని మోదీకి గుర్తున్నాయని, అందుకే ఆయన్ను ఎన్డీఏ మీటింగ్ కి పిలవలేదన్నారు రోజా. ఇక చంద్రబాబుని ఏపీకి సీఎం చేసే పనిలో పవన్ ఉన్నారని, ఇక్కడ తనని తాను దళపతి అని చెప్పుకుంటున్న పవన్, ఢిల్లీలో చంద్రబాబు కోసం దళారీ అవతారమెత్తారని ఎద్దేవా చేశారు. గోదావరి జిల్లాల్లో పవన్ ఊగి పోతూ ప్రసంగాలు చేశారని.. తాను సీఎం పదవికి రెడీగా ఉన్నానని చెప్పుకునే పవన్.. సీఎం పదవి పెళ్లికొడుకు వేషం అనుకున్నారేమో అని కౌంటర్ ఇచ్చారు. సీఎం కావాలంటే ప్రజా సమస్యలు తెలియాలన్నారు.

పవన్ సినిమాల్లో హీరో, పాలిటిక్స్ లో జీరో అని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా పవన్ ఉన్నారంటే దానికి కారణం చిరంజీవి అని చెప్పారు. పవన్ ఫ్యాన్స్‌ ని తిట్టిన బాలకృష్ణ పిలిస్తే మొహమాటం లేకుంటా ఆయన ఇంటర్వ్యూలకు వెళ్తారని వెటకారం చేశారు.

తల్లి అంటే గౌరవం లేదా..?

పవన్ కల్యాణ్ కి ఎవరిమీదా గౌరవం లేదన్నారు రోజా. కనీసం తల్లి అన్నా కూడా గౌరవం లేదన్నారు. ఉంటే ఆమెను అవమానించినవారి కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకోరని చెప్పారు. సినిమాల్లో రైటర్లు రాసిచ్చే డైలాగ్స్ చెప్పే పవన్, పాలిటిక్స్‌ లో చంద్రబాబు చెప్పిన డైలాగ్స్ పలుకుతున్నారని అన్నారు. చంద్రబాబుకు చేసే మనసు లేదు, పవన్‌ కు విషయం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Tags:    
Advertisement

Similar News