జనసేనకు మళ్లీ జీరోనే.. చంద్రబాబు ప్లాన్ ఇదే - కేశినేని నాని

జనసేనకు కేటాయించిన 24 సీట్లలోనూ చంద్రబాబు నాయుడు సూచించిన వారికే టికెట్లు ఇస్తారన్నారు నాని. కొంతమందిని జనసేనలోకి చంద్రబాబే పంపించి టికెట్లు ఇప్పించుకుంటారని ఆరోపించారు

Advertisement
Update: 2024-02-24 15:05 GMT

తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనపై స్పందించారు ఎంపీ కేశినేని నాని. పవన్ కల్యాణ్‌ చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్నారని కామెంట్ చేశారు నాని. గతంలోనూ చంద్రబాబు ఏది చెప్తే దానికి పవన్‌కల్యాణ్ తల ఊపారన్నారు. చంద్రబాబునాయుడు, లోకేశ్‌లకు అధికారం క‌ట్ట‌బెట్టేందుకు పవన్‌కల్యాణ్ కష్టపడుతున్నాడన్నారని.. సొంత పార్టీ మీద ఆయనకు ఏ మాత్రం శ్రద్ధ లేదన్నారు.

చంద్రబాబు ప్లాన్ ఇదే..!

జనసేనకు కేటాయించిన 24 సీట్లలోనూ చంద్రబాబు నాయుడు సూచించిన వారికే టికెట్లు ఇస్తారన్నారు నాని. కొంతమందిని జనసేనలోకి చంద్రబాబే పంపించి టికెట్లు ఇప్పించుకుంటారని ఆరోపించారు. జనసేన అభ్యర్థులపై పోటీకి కొంత మంది రెబల్స్‌ను కూడా చంద్రబాబు పోటీ పెడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరకు జనసేనకు మళ్లీ సున్నానే మిగులుతుందన్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని.. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుద్దన్నారు నాని. ఎవరితో కలిసి పోటీ చేసినా టీడీపీ అధికారంలోకి రావడం కష్టమన్నారు. ప్రజలంతా జగన్‌ వెనకాలే ఉన్నారన్నారు నాని.

Tags:    
Advertisement

Similar News