నట్లు, బోల్టులు వేసినా బోన్స్ సెట్టవ్వవ్.. కొడకల్లారా! - ఆమంచి సోదరులకు కరణం వార్నింగ్

ఒకడు పక్క నియోజకవర్గానికి వెళ్లాడు.. మరొకడు పక్క పార్టీలోకి వెళ్లాడు... అలా వెళ్లి కూడా చీరాలలో ప్రశాంతతను దెబ్బతీయాలని చూస్తున్నారని కరణం వెంకటేష్ ఆరోపించారు.

Advertisement
Update: 2023-09-02 15:07 GMT

చీరాల వైసీపీలో వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈసారి బహిరంగంగానే ఆమంచి సోదరులకు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ వార్నింగ్ ఇచ్చారు. ఒకడు పక్క నియోజకవర్గానికి వెళ్లాడు.. మరొకడు పక్క పార్టీలోకి వెళ్లాడు... అలా వెళ్లి కూడా చీరాలలో ప్రశాంతతను దెబ్బతీయాలని చూస్తున్నారని కరణం వెంకటేష్ ఆరోపించారు. ఇప్పటి వరకు పద్ధ‌తిగా ఉన్నామని సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడితే చెంపచెల్లుమనిపిస్తా నా కొడకల్లారా అంటూ వార్నింగ్ ఇచ్చారు. చీరాలలో స్వేచ్ఛ‌, ప్రశాంతతకు భంగం కలిగిస్తే ... నట్లు, బోల్టులు వేసినా సరే బోన్స్‌ సెట్‌ కాని పరిస్థితి వస్తుందని అని వార్నింగ్ ఇచ్చారు.

గత ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరపున గెలిచిన కరణం బలరాం ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. చీరాలలో వైసీపీ బాధ్యతలను ఆయన కుమారుడు చూస్తున్నారు. ఇది వరకు చీరాల నుంచి గెలిచి, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరు ఇన్‌చార్జ్‌గా జగన్‌ పంపించారు. ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు ఆమంచి స్వాములు ఇటీవల జనసేనలో చేరారు. ఇటీవల స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగానూ ఆమంచి వర్గీయులకు, కరణం వర్గీయులకు గొడవ జరిగింది.

కరణం బలరాంను కులం పేరుతో ఆమంచి కృష్ణమోహన్ దూషించారు. అదే సమయంలో ఆమంచిని కరణం వెంకటేష్‌ బూతులు తిట్టారు. ఇలా ఆమంచి సోదరులకు, కరణం ఫ్యామిలీకి మధ్య వార్‌ నడుస్తోంది. ఇప్పుడు అది బహిరంగంగా వార్నింగులు ఇచ్చుకునే వరకు వెళ్లింది.

Tags:    
Advertisement

Similar News