భార్యాపిల్లలను కాల్చి చంపి.. హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

పోలీస్‌స్టేషన్‌ నుంచి బుధవారం రాత్రి 11 గంటలకు తుపాకీ తెచ్చుకున్న వెంకటేశ్వర్లు.. అర్ధరాత్రి తర్వాత ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది.

Advertisement
Update: 2023-10-05 07:06 GMT

కడపకు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు (50).. తన కుటుంబంతో కలసి స్థానిక కోఆపరేటివ్‌ కాలనీలో నివసిస్తున్నాడు. పోలీస్‌స్టేషన్‌ నుంచి బుధవారం రాత్రి 11 గంటలకు తుపాకీ తెచ్చుకున్న వెంకటేశ్వర్లు.. అర్ధరాత్రి తర్వాత ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై ఆయన ఆరా తీశారు. హెడ్‌ కానిస్టేబుల్‌ వెంక‌టేశ్వ‌ర్లు వ్యక్తిగత కారణాలతోనే భార్యాపిల్ల‌ల‌ను చంపి.. తానూ ఆత్మహత్య చేసుకున్నట్టు డీఎస్పీ షరీఫ్‌ ఎస్పీకి వివరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags:    
Advertisement

Similar News