బాబు జెండా మోయడమే పవన్‌ అజెండా..

సీఎం జగన్‌ పోలీసు వ్యవస్థని నియంత్రణ చేసుంటే చంద్రబాబు, లోకేష్, పవన్‌ కల్యాణ్‌ పాదయాత్ర, బ‌స్సు యాత్రలు చేసేవారా..? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.

Advertisement
Update: 2024-02-01 07:17 GMT

చంద్రబాబు జెండా మోయడమే పవన్‌ కల్యాణ్‌ అజెండా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసమే పవన్‌ ఎదురుచూస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని దిక్కుమాలిన రాజకీయాలు చేసినా ఆయన్ని ప్ర‌జ‌లెవరూ నమ్మరని వెలంపల్లి స్పష్టంచేశారు.

ఇంటెలిజెన్స్‌ మాజీ డీజీ వెంకటేశ్వరరావు ద్వారా పోలీసు వ్యవస్థను చంద్రబాబు వాడుకున్నాడని వెలంపల్లి విమర్శించారు. పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన తెలిపారు. సీఎం జగన్‌ పోలీసు వ్యవస్థని నియంత్రణ చేసుంటే చంద్రబాబు, లోకేష్, పవన్‌ కల్యాణ్‌ పాదయాత్ర, బ‌స్సు యాత్రలు చేసేవారా..? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో 10 శాతమైనా చేశావా బాబూ..? అంటూ చంద్రబాబును వెలంపల్లి నిలదీశారు.

విజయవాడలో బొండా ఉమా ఆటలు ఇక సాగవన్నారు. ఉమా చేసిన దందాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయని ఆయన తెలిపారు. విదేశాలకు వెళ్లి పేకాట, క్యాసినో ఆడే ఉమాకు అభివృద్ధి గురించి ఏం తెలుసని ఆయన నిలదీశారు. సెంట్రల్‌ నియోజకవర్గం అభివృద్ధి గురించి ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా పోరాటం చేశాడా..? అని ప్రశ్నించారు. ఇక బొండా ఉమా కొడుకులు బైక్‌ రేసుల్లో అమాయకులైన విద్యార్థులను చంపేశారని ఆయన గుర్తుచేశారు.

Tags:    
Advertisement

Similar News