రేపే టీడీపీ, జనసేన ఫస్ట్‌ లిస్ట్‌

తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కల్యాణ్ ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. వీరిద్దరి సమావేశం తర్వాత ఉమ్మడిగా ప్రెస్‌ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని.. అప్పుడే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.

Advertisement
Update: 2024-02-23 08:45 GMT

తెలుగుదేశం, జనసేన తొలి ఉమ్మడి జాబితా రేపు విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. శనివారం ఉదయం 11 గంటల 40 నిమిషాలకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. దాదాపు 70-60 స్థానాల్లో అభ్యర్థులపై రేపు క్లారిటీ వస్తుందని ప్రచారం జరుగుతోంది.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కల్యాణ్ ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. వీరిద్దరి సమావేశం తర్వాత ఉమ్మడిగా ప్రెస్‌ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని.. అప్పుడే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. శనివారం ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వివాదాలు లేని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని రెండు పార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఓ వైపు వైసీపీ అభ్యర్థుల ప్రకటన, బహిరంగ సభలతో దూసుకుపోతుంటే.. టీడీపీ, జనసేన అభ్యర్థులపై క్లారిటీ రాకపోవడంతో రెండు పార్టీల క్యాడర్‌ తీవ్ర అసంతృప్తిలో ఉంది. టికెట్ విషయంలో చాలా స్థానాల్లో రెండు పార్టీల నేతల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి.

Tags:    
Advertisement

Similar News