డల్లాస్‌లో కొట్టుకున్న టీడీపీ- జనసేన కార్యకర్తలు

ఈవెంట్ మేనేజర్లపై టీడీపీ నేత కేసీ చేకూరి దాడి చేశారు. ఈవెంట్ మేనేజర్ల ఫిర్యాదుతో చేకూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీ చేకూరిని ఫస్ట్ కారల్టెన్‌ స్టేషన్‌కు అమ‌రికా పోలీసులు తీసుకెళ్లారు.

Advertisement
Update: 2023-01-02 06:32 GMT

అమెరికాలోని డల్లాస్‌లో టీడీపీ, జనసేన వర్గాలు కొట్టుకున్నాయి. కొత్త ఏడాది వేడుకల సందర్భంలో బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌గా విడిపోయి ఘర్షణ పడ్డారు. డల్లాస్‌లో అర్ధ‌రాత్రి మ్యూజికల్‌ నైట్‌లో ఈ గొడవ జరిగింది. కార్యక్రమం వద్ద ఏర్పాటు చేసిన చిరంజీవి, పవన్ కల్యాణ్ పోస్టర్లను బాలకృష్ణ ఫ్యాన్స్ చించివేయడంతో గొడవ మొదలైంది.

ఈవెంట్ మేనేజర్లపై టీడీపీ నేత కేసీ చేకూరి దాడి చేశారు. ఈవెంట్ మేనేజర్ల ఫిర్యాదుతో చేకూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీ చేకూరిని ఫస్ట్ కారల్టెన్‌ స్టేషన్‌కు అమ‌రికా పోలీసులు తీసుకెళ్లారు. టీడీపీ నేత చేకూరి బెయిల్ కోసం తానా పెద్దలు రంగంలోకి దిగి ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News