చంద్రబాబు వెన్నుపోటు.. బోరున విలపించిన బొల్లినేని రామారావు

టీడీపీ అభ్యర్థి ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని బొల్లినేని రామారావు అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Update: 2024-02-29 12:56 GMT

టీడీపీ నాయకుడు బొల్లినేని రామారావు ఉదయగిరి నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టారు. దానికి ప్ర‌తిఫ‌లంగా నియోజ‌క‌వ‌ర్గ టికెట్ ఆశించారు. అయితే, ఆయనను కాదని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నారై కాకర్ల సురేష్‌కు టికెట్ కేటాయించారు. దీంతో బొల్లినేని రామారావు తీవ్రంగా కలత చెందారు. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో బోరున విలపించారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నానని, తనకు టికెట్‌ రానందుకు బాధగా లేదని, చంద్రబాబు చేసిన పని తనను తీవ్రంగా బాధ‌పెట్టింద‌ని ఆయన ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

టీడీపీ అభ్యర్థి ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని బొల్లినేని రామారావు అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బొల్లినేని ఏర్పాటు చేసిన సమావేశానికి పెద్ద ఎత్తున ఆయన వర్గం హాజరైంది. ఉదయగిరి అభ్యర్థి ఎంపిక విషయంలో చంద్రబాబు అనుస‌రించిన తీరుతో తాను కలత చెందానని, తనకు చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉదయగిరిలో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన చెప్పారు. టీడీపీలో బ్రోకర్లు రాజ్యమేలుతున్నారని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలా బ్రోకర్లు టికెట్లు ఇప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News