పవన్‌కు షాక్.. వైసీపీలోకి చేగొండి

2018లో జనసేనలో చేరారు చేగొండి సూర్యప్రకాష్‌. 2022 జనవరిలో సూర్యప్రకాష్‌ను పీఏసీలో మెంబర్‌గా నియమించారు పవన్‌కల్యాణ్‌.

Advertisement
Update: 2024-03-01 10:30 GMT

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు బిగ్ షాక్ తగిలింది. పవన్‌కల్యాణ్‌ వైఖరికి నిరసనగా జనసేన పీఏసీ మెంబర్ చేగొండి సూర్య ప్రకాష్‌ పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటారని సమాచారం. మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కుమారుడే సూర్య ప్రకాష్‌.

2018లో జనసేనలో చేరారు చేగొండి సూర్యప్రకాష్‌. 2022 జనవరిలో సూర్యప్రకాష్‌ను పీఏసీలో మెంబర్‌గా నియమించారు పవన్‌కల్యాణ్‌. అయితే ఇటీవలి రాజకీయ పరిణామాలు, టీడీపీతో సీట్ల పంపకాలు, తన సీటుపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వకపోవడంతోనే అసంతృప్తితో ఉన్న సూర్యప్రకాష్‌ పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మరోవైపు సూర్యప్రకాష్ తండ్రి చేగొండి సైతం తెలుగుదేశంతో పొత్తు అంశం, సీట్ల పంపకాలు, పవర్‌ షేరింగ్ లాంటి పలు అంశాలపై పవన్‌కు వరుస లేఖలు సంధించారు. చేగొండి సూచనలను పవన్‌కల్యాణ్ పెద్దగా పట్టించుకోలేదు. పరోక్షంగా తనకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు అక్కర్లేదంటూ చేగొండిపై విమర్శలు చేశారు.

Tags:    
Advertisement

Similar News