నా వృత్తిని అవమానించారు.. అందుకే తొడగొట్టి మీసం మెలేశా

తిడితే అందరిలా పడి ఉంటానని అంబటి అనుకున్నారని, తాను సీరియస్ గా రియాక్ట్ అయ్యేసరికి వాళ్లు బిత్తర పోయారని చెప్పుకొచ్చారు బాలకృష్ణ.

Advertisement
Update: 2023-09-21 12:40 GMT

అసెంబ్లీలో జరిగిన సినిమాటిక్ సీన్ కి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో తాను ఎందుకు తొడగొట్టాల్సి వచ్చిందో, ఎందుకు మీసం మెలేయాల్సి వచ్చిందో చెప్పారు. ముందుగా అంబటి రాంబాబే తనను రెచ్చగొట్టారని అంటున్నారు బాలకృష్ణ. అందుకే తాను అలా ప్రవర్తించానని చెప్పారు. తానెవరికీ భయపడబోనని, జైలులో పెడితే భయపడతారేమో అనుకోవడం వారి భ్రమ అని అన్నారు.


అసలేం జరిగింది..?

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలంతా పోడియం వద్దకు వెళ్తున్నామని ఆసమయంలో అంబటి తన వృత్తిని అవమానించారని చెప్పారు బాలకృష్ణ. పోయి సినిమాలు చేసుకో అంటూ అవమానకరంగా మాట్లాడారన్నారు. అందుకే తాను ఆయనకు కౌంటర్ గా తొడకొట్టి మీసం మెలేశానని చెప్పుకొచ్చారు బాలయ్య.

భయపడేవాడిని కాదు..

నటన తనకు వృత్తి అని, తల్లిలాంటి వృత్తిని అవమానిస్తే తానెందుకు ఊరుకుంటానని చెప్పారు బాలకృష్ణ. తాను ఎవరికీ భయపడబోనని, భయపడాల్సిన అవసరం తనకు లేదన్నారు. తిడితే అందరిలా పడి ఉంటానని అంబటి అనుకున్నారని, తాను సీరియస్ గా రియాక్ట్ అయ్యేసరికి వాళ్లు బిత్తర పోయారని చెప్పుకొచ్చారు. వైసీపీ వాళ్లు తమని రాష్ట్రం నుంచి తరిమేయాలని చూస్తున్నారని అందుకే అసెంబ్లీలో సైతం తమను అడ్డుకుంటున్నారని చెప్పారు. పార్టీ కార్యకర్తలతోపాటు ప్రజలంతా బయటకు రావాలన్నారు. లేకపోతే రాష్ట్రం నాశనమైపోయిందని చెప్పారు బాలకృష్ణ. 

Tags:    
Advertisement

Similar News