ఇది పిరికిపంద చర్య అయితే.. మీ లోకేష్‌ చేసింది ఏమవుతుంది అచ్చెన్నా?

నారా లోకేష్‌ ఆ సినిమాపై కోర్టు మెట్లు ఎక్కడం వల్ల వైఎస్‌ జగన్‌కు, వైసీపీకి మంచే జరిగింది. రెండు నెలల క్రితం విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు విడుదలవుతోంది.

Advertisement
Update: 2024-02-15 12:13 GMT

రాజధాని ఫైల్స్‌ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం పిరికిపంద చర్య అని టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆ సినిమా ఆగిపోవడానికి కారణం వైఎస్‌ జగన్‌ అని నిందలు వేస్తున్నారు. సినిమా చూస్తే ప్రజలు ఛీకొడుతారని జగన్‌ భయపడ్డారని ఆయన అన్నారు. సినిమాలో ఎవరినీ కించపరిచే సన్నివేశాలు లేవని ఆయన కితాబు ఇచ్చారు.

రాజధాని ఫైల్స్‌ అనే సినిమా ప్రదర్శనను ఆపేయడానికి జగన్‌ ప్రయత్నిస్తే రాంగోపాల్‌ వర్మ నిర్మించిన వ్యూహం సినిమాను ఆపేయడానికి ప్రయత్నించింది అచ్చెన్నాయుడి బాస్ కొడుకు నారా లోకేష్‌ కాదా అని ప్రశ్నించాల్సి వస్తోంది. వ్యూహం సినిమా విడుదలను ఆపేయాలని కోర్టుకు ఎక్కింది నారా లోకేష్‌ కాదా..? ఆ సినిమా వస్తే చంద్రబాబు నిజస్వరూపం, తన నిజ స్వరూపం బయటపడుతుందనే కదా లోకేష్‌ భయపడింది.

నారా లోకేష్‌ ఆ సినిమాపై కోర్టు మెట్లు ఎక్కడం వల్ల వైఎస్‌ జగన్‌కు, వైసీపీకి మంచే జరిగింది. రెండు నెలల క్రితం విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు విడుదలవుతోంది. సరిగ్గా ఎన్నికల వేడిలో అది విడుదల అయ్యేలా చేయడం టీడీపీకే నష్టం.

Tags:    
Advertisement

Similar News