కావాలని జగన్‌పై దుష్ప్ర‌చారం.. ఆ మాత్రం తెలియదా షర్మిలా..?

పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్‌మెంట్‌ అని ఆమె అన్నారు. జగన్‌కు కమిట్‌మెంట్‌ ఉంది కాబట్టే కోర్టు కేసులను ఎదుర్కుంటున్నారు.

Advertisement
Update: 2024-03-06 11:52 GMT

తన సోదరుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై బురద చల్లడమే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి పనిగా పెట్టుకున్నారు. ఆమె తాజా ప్రకటన అందుకు మంచి ఉదాహరణ. వైఎస్‌ జగన్‌ విశాఖ విజన్‌ పేరిట చేసిన ప్రకటనపై ఆమె ఎక్స్‌ (ట్విట్టర్‌)లో స్పందించారు. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ఆమె జగన్‌ను అమాయకంగా ప్రశ్నించారు. ఏం అడ్డొచ్చిందో ఆమెకు తెలియదా..?

టీడీపీ అడుగడుగునా అడ్టుకుంటున్న విషయం ఆమెకు తెలియదనుకోవాలా? మూడు రాజధానులపై కోర్టులకు ఎక్కి విశాఖ పరిపాలనా రాజధాని కాకుండా అడ్డుకుంటుంది ఎవరనే కనీస అవగాహన కూడా ఆమెకు లేదా..? కోర్టు కేసుల కారణంగా వైఎస్‌ జగన్‌ పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించలేకపోతున్నారు.

పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్‌మెంట్‌ అని ఆమె అన్నారు. జగన్‌కు కమిట్‌మెంట్‌ ఉంది కాబట్టే కోర్టు కేసులను ఎదుర్కుంటున్నారు. అవి పరిష్కారమయ్యే వరకు వేచి చూడడం ధర్మంగా ఆయన భావిస్తున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని, విశాఖలోనే ఉంటానని ఆయన స్పష్టంగా చెప్పారు. అమరావతిపై చంద్రబాబు భ్రమలు కల్పించి మోసం చేయడం ఆమెకు గుర్తుకు రాదా..? కాంగ్రెస్‌ కూడా భ్రమరావతి పాటే పాడుతోంది కదా....

Tags:    
Advertisement

Similar News