మిస్ యు నాన్నా..! అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్

తారకరత్న ఓ మంచి భర్త, ఓ మంచి తండ్రి, ఓ మంచి మనిషి అంటూ ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఇన్ స్టా లో గుర్తు చేసుకున్నారు. హ్యాపీ బర్త్ డే అంటూ.. సో బ్యాడ్లీ మిస్ యూ నాన్నా.. అంటూ మెసేజ్ పెట్టారు.

Advertisement
Update: 2023-02-23 03:10 GMT

తారకరత్న ఆకస్మిక మరణం నుంచి నందమూరి కుటుంబం ఇంకా తేరుకోలేదు. తారకరత్న భార్య, బిడ్డలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ విషాదంలో మరో విచారకరమైన విషయం ఏంటంటే.. ఈనెల 22న తారకరత్న 40వ పుట్టినరోజు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పుట్టినరోజుని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు కుటుంబ సభ్యులు. ఆయన అస్వస్థతకు గురికాకుండా ఉంటే డెస్టినేషన్ బర్త్ డే జరుపుకోవాలనుకున్నారట. కానీ అనుకోకుండా కుప్పంలో ఆయనకు స్ట్రోక్ రావడం, బెంగళూరుకి తరలించడంతో.. పుట్టినరోజు లోగా ఆయన కోలుకుని తిరిగొస్తే, కుటుంబ సభ్యుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవాలనుకున్నారట. కానీ ముందే ఆయన చనిపోయారు. దీంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర భావోద్వేగంతో ఇన్ స్టా లో ఓ పోస్ట్ పెట్టారు.


కంప్లీట్ మ్యాన్..

తారకరత్న చనిపోయిన తర్వాత ఆయన గొప్పదనాన్ని అందరూ గుర్తు చేస్తున్నారు. నటుడిగా ఆయన అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినా మంచి మనిషిగా ఆయన అందరికీ గుర్తుండిపోయారని అంటున్నారు. కొత్తగా పరిచయమైన వారిని సైతం ఆప్యాయంగా వరుస కలిపి పిలుస్తారని.. అక్క, అన్న, మామ.. అంటూ ఆయన త్వరగా కలసిపోతారని ఆయనతో ఉన్న జ్ఞాపకాలను చాలామంది సోషల్ మీడియాలో పంచుకున్నారు. తారకరత్న ఓ మంచి భర్త, ఓ మంచి తండ్రి, ఓ మంచి మనిషి అంటూ ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఇన్ స్టా లో గుర్తు చేసుకున్నారు. హ్యాపీ బర్త్ డే అంటూ.. సో బ్యాడ్లీ మిస్ యూ నాన్నా.. అంటూ మెసేజ్ పెట్టారు.

పుట్టినరోజుకి మూడు రోజుల ముందే తారకరత్న చనిపోయవడం నిజంగా బాధాకరం అంటున్నారు నెటిజన్లు. ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి ఇన్ స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. అది చూసిన అభిమానులు మిస్ యూ తారకరత్న అంటూ రిప్లై ఇస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News