దేశంలో రికవరీ రేటు ఎలా ఉందంటే..

భారత్‌లో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ఓ వార్త కాస్త ఊరట కలిగిస్తోంది. కేసులు నమోదవుతున్నప్పటికీ.. మరణాలు,రికవరీల రేటు బాగానే ఉందని కేంద్రం ప్రకటించింది. ఆదివారం దేశవ్యాప్తంగా 14.02 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. వారిలో 3.54 లక్షల మందికి కరోనా సోకింది. ఇకపోతే.. సోమవారం కొత్తగా 2.20 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. అంటే సెకండ్‌ వేవ్‌లో కరోనా తీవ్ర రూపంలో ప్రతాపం చూపిస్తున్నా మరణాల రేటు 1.12 శాతం మాత్రమే ఉందని, 98.88 […]

Advertisement
Update: 2021-04-27 05:31 GMT

భారత్‌లో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ఓ వార్త కాస్త ఊరట కలిగిస్తోంది. కేసులు నమోదవుతున్నప్పటికీ.. మరణాలు,రికవరీల రేటు బాగానే ఉందని కేంద్రం ప్రకటించింది. ఆదివారం దేశవ్యాప్తంగా 14.02 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. వారిలో 3.54 లక్షల మందికి కరోనా సోకింది. ఇకపోతే.. సోమవారం కొత్తగా 2.20 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. అంటే సెకండ్‌ వేవ్‌లో కరోనా తీవ్ర రూపంలో ప్రతాపం చూపిస్తున్నా మరణాల రేటు 1.12 శాతం మాత్రమే ఉందని, 98.88 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం తెలుస్తోంది. ఇక సెకండ్‌ వేవ్‌ మొదట్లో 37శాతం మందికి వెంటిలేషన్‌ పాలవ్వగా.. ఇప్పుడు ఆ రేటు 28 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు చెప్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News