నాకు ఏ వ్యాధీ లేదు... అమిత్‌షా ట్వీట్‌

తాను ఏ వ్యాధితో బాధపడడం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. తనకు ఏదో రోగం సోకిందని.. అందుకే బయటకు రావడం లేదనే రూమర్లపై ఆయన స్పందించారు. ట్విట్టర్‌లో పెద్ద లేఖ పెట్టారు. గత కొంత కాలంగా సోషల్‌ మీడియాలో అమిత్‌షా ఆరోగ్యంపై పుకార్లు నడుస్తున్నాయి. ఆయన ఆరోగ్యం బాలేదని పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఆయన స్పందించారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ కేసులు దేశంలో […]

Advertisement
Update: 2020-05-09 06:32 GMT

తాను ఏ వ్యాధితో బాధపడడం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. తనకు ఏదో రోగం సోకిందని.. అందుకే బయటకు రావడం లేదనే రూమర్లపై ఆయన స్పందించారు. ట్విట్టర్‌లో పెద్ద లేఖ పెట్టారు.

గత కొంత కాలంగా సోషల్‌ మీడియాలో అమిత్‌షా ఆరోగ్యంపై పుకార్లు నడుస్తున్నాయి. ఆయన ఆరోగ్యం బాలేదని పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఆయన స్పందించారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు.

కరోనా వైరస్‌ కేసులు దేశంలో బయటపడ్డ తర్వాత కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా బయట ఎక్కువ కనిపించడం లేదు. కేవలం ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లకు మాత్రమే అటెండ్‌ అయ్యారు. దీంతో ఆయనకు కరోనా సోకిందని కొందరు..లేదు షుగర్‌ లెవల్స్‌ పెరిగి ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయని మరికొందరు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

దీంతో అమిత్‌ షా ట్వీట్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పారు. ఈ రూమర్లతో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారని… అందుకే క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News