సరికొత్త లోగోతో రాయల్ చాలెంజ్

2020 ఐపీఎల్ సీజన్ కు బెంగళూరు రెడీ ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2020 సీజన్ కోసం… మాజీ రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సరికొత్త లోగోతో ముస్తాబయ్యింది. 2008 నుంచి 2019 సీజన్ వరకూ ఉపయోగించిన లోగో స్థానంలో బ్రాండ్ న్యూలుక్ లోగోను ఆవిష్కరించింది. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త దశాబ్దాన్ని తాము కొత్తలోగోతో ప్రారంభించబోతున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు క్రిస్ గేల్, ఏబీ […]

Advertisement
Update: 2020-02-14 20:01 GMT
  • 2020 ఐపీఎల్ సీజన్ కు బెంగళూరు రెడీ

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2020 సీజన్ కోసం… మాజీ రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సరికొత్త లోగోతో ముస్తాబయ్యింది.

2008 నుంచి 2019 సీజన్ వరకూ ఉపయోగించిన లోగో స్థానంలో బ్రాండ్ న్యూలుక్ లోగోను ఆవిష్కరించింది. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త దశాబ్దాన్ని తాము కొత్తలోగోతో ప్రారంభించబోతున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది.

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ లాంటి ప్రపంచ మేటి ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహించిన విజేతకాలేకపోయింది.

2017, 2018 సీజన్లలో లీగ్ ఆఖరిస్థానంలో నిలిచిన బెంగళూరు జట్టు…2016 సీజన్లో అత్యుత్తమంగా రన్నరప్ స్ధానం సంపాదించింది. 2019 సీజన్ ను మాత్రం 6వ స్థానంతో ముగించగలిగింది.

Tags:    
Advertisement

Similar News