ఒమన్ తో నేడు భారత్ డూ ఆర్ డై

మస్కట్ వేదికగా ప్రపంచకప్ ఫుట్ బాల్ అర్హత సమరం ప్రపంచకప్ ఫుట్ బాల్ ఆసియా జోన్ అర్హత పోటీల రెండో అంచె 106వ ర్యాంకర్ భారత్ కు డూ ఆర్ డై గా మారింది. మస్కట్ వేదికగా ఈరోజు ఒమన్ తో జరిగే రెండో అంచె మ్యాచ్ లో సునీల్ చెత్రీ నాయకత్వంలోని భారత్ ఆరునూరైనా నెగ్గి తీరాల్సి ఉంది తొలి అంచెలో 1-2తో ఓటమి జోనల్ గ్రూపు తొలిరౌండ్ పోటీలలో గౌహతీ వేదికగా ఒమాన్ తో ముగిసిన […]

Advertisement
Update: 2019-11-18 21:00 GMT
  • మస్కట్ వేదికగా ప్రపంచకప్ ఫుట్ బాల్ అర్హత సమరం

ప్రపంచకప్ ఫుట్ బాల్ ఆసియా జోన్ అర్హత పోటీల రెండో అంచె 106వ ర్యాంకర్ భారత్ కు డూ ఆర్ డై గా మారింది. మస్కట్ వేదికగా ఈరోజు ఒమన్ తో జరిగే రెండో అంచె మ్యాచ్ లో సునీల్ చెత్రీ నాయకత్వంలోని భారత్ ఆరునూరైనా నెగ్గి తీరాల్సి ఉంది

తొలి అంచెలో 1-2తో ఓటమి

జోనల్ గ్రూపు తొలిరౌండ్ పోటీలలో గౌహతీ వేదికగా ఒమాన్ తో ముగిసిన పోటీలో భారత్ 1-2 గోల్స్ తో పోరాడి ఓడింది. ఒమన్ ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ ఎనిమిదిసార్లు తలపడిన భారత్ కు ఒక్క గెలుపు లేదు. ఆరుసార్లు ఓడి…రెండుసార్లు మాత్రమే ఒమన్ తో పోటీలను డ్రాగా ముగించగలిగింది.

4 రౌండ్లలో 3 డ్రాలు….

ఖతర్, బంగ్లాదేశ్, అఫ్ఘన్ జట్లతో మ్యాచ్ లను డ్రాలతో సరిపెట్టుకొన్న భారత జట్టు..తొలి విజయం సాధించాలన్నపట్టుదలతో ఉంది.

గ్రూప్-ఈ లీగ్ లో 3పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన భారత్…రెండోరౌండ్లో ఆరునూరైనా నెగ్గి తీరాల్సి ఉంది.
స్టార్ స్ట్ర్రయికర్ సునీల్ చెత్రీ నాయకత్వంలోని భారతజట్టు ప్రస్తుత ఈ మ్యాచ్ లో నెగ్గాలంటే…అత్యుత్తమ స్థాయిలో రాణించి తీరాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News