కోడెల ఆత్మహత్యకు ముందు 20నిమిషాల ఫోన్ కాల్

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య తెలుగు నాట సంచలనం సృష్టించింది. నిన్న మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.38 గంటల వరకూ కోడెల మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. అప్పుడు వీడియో కూడా తీశారు. బలమైన తాడు మెడకు బిగుసుకొని… ఉరివేసుకోవడం వల్లే కోడెల చనిపోయినట్లు ప్రాధమికంగా వైద్యులు తేల్చినట్టు సమాచారం. పూర్తిస్థాయి పోస్టుమార్టం నివేదిక ఈరోజు వెలువడనుంది. అయితే నిన్న ఉదయం టిఫిన్ చేశాక 8.30 గంటల సమయంలో ఒకరితో ఫోన్ లో మాట్లాడినట్టు […]

Advertisement
Update: 2019-09-17 00:16 GMT

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య తెలుగు నాట సంచలనం సృష్టించింది. నిన్న మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.38 గంటల వరకూ కోడెల మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. అప్పుడు వీడియో కూడా తీశారు.

బలమైన తాడు మెడకు బిగుసుకొని… ఉరివేసుకోవడం వల్లే కోడెల చనిపోయినట్లు ప్రాధమికంగా వైద్యులు తేల్చినట్టు సమాచారం. పూర్తిస్థాయి పోస్టుమార్టం నివేదిక ఈరోజు వెలువడనుంది.

అయితే నిన్న ఉదయం టిఫిన్ చేశాక 8.30 గంటల సమయంలో ఒకరితో ఫోన్ లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. సుమారు 20 నిమిషాలకు పైగా ఫోన్ లో మాట్లాడినట్టు కాల్ డేటా లో గుర్తించినట్టు తెలిసింది. ఆ వ్యక్తి ఎవరు? ఏం మాట్లాడారు? అనేది తేలితే కోడెల సూసైడ్ మిస్టరీ వీడిపోవడం ఖాయమని పోలీసులు భావిస్తున్నారు.

కోడెల సూసైడ్ 10.10 గం.లకు చేసుకున్నట్టు చెబుతున్నారు. అంటే ఫోన్ మాట్లాడాకే మనస్తాపంతో కోడెల ఆత్మహత్య చేసుకున్నట్టు అర్థమవుతోంది. దీన్నిబట్టి కోడెల సూసైడ్ కు ఆ ఫోన్ కాల్ కు సంబంధం ఉందని… పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.

Tags:    
Advertisement

Similar News