మీరే మా కొంపలను ముంచారు " లోకేష్‌పై బాధితుల ఆగ్రహం

పోలవరం ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన నారా లోకేష్‌కు భాధితుల నుంచి చుక్కెదురైంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి పోలవరం ముంపు ప్రాంతం దేవిపట్నం ప్రాంతంలో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులు లోకేష్‌ను నిలదీశారు. ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండానే గత ప్రభుత్వం కాపర్ డ్యాంను నిర్మించిందని… దాని వల్లే గోదావరి తమ ఊర్లను ముంచేసిందని బాధితులు వాపోయారు. పునరావాసం కల్పించి ఆ తర్వాత కాపర్ డ్యాం కట్టి ఉంటే తమ బతుకులు ఇలా […]

Advertisement
Update: 2019-08-08 20:05 GMT

పోలవరం ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన నారా లోకేష్‌కు భాధితుల నుంచి చుక్కెదురైంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి పోలవరం ముంపు ప్రాంతం దేవిపట్నం ప్రాంతంలో లోకేష్ పర్యటించారు.

ఈ సందర్భంగా బాధితులు లోకేష్‌ను నిలదీశారు. ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండానే గత ప్రభుత్వం కాపర్ డ్యాంను నిర్మించిందని… దాని వల్లే గోదావరి తమ ఊర్లను ముంచేసిందని బాధితులు వాపోయారు. పునరావాసం కల్పించి ఆ తర్వాత కాపర్ డ్యాం కట్టి ఉంటే తమ బతుకులు ఇలా అయ్యేవి కావన్నారు.

నష్టపరిహారం ఇచ్చి ఉంటే తాము వెళ్లిపోయి ఉండేవారిమని… కానీ అలా చేయకుండా కాపర్ డ్యాం కట్టి తమ కొంపలు ముంచేశారని లోకేష్‌ వద్ద ఆవేదన చెందారు. మీరంతా బాగానే ఉన్నారు.. మేమే వరదల్లో చిక్కుకున్నామని బాధితులు వాపోయారు.

Tags:    
Advertisement

Similar News