నిన్ను ఆవే అనుకున్నారు... కానీ దున్నవని తేలింది...

పాలిచ్చే ఆవులాంటి తనను కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని ప్రజలను చంద్రబాబు విమర్శించడం పై వైసీపీ నేత సీ. రామచంద్రయ్య ఘాటుగా స్పందించారు. 2014లో ప్రజలు కూడా బాబును ఆవులాంటి వాడే అనుకున్నానని… కానీ ఐదేళ్ల పాలన చూసిన తర్వాత చంద్రబాబు ఒక దున్న అని ప్రజలకు అర్థం అవడం వల్లే ఎన్నికల్లో చిత్తుగా ఓడించారన్నారు. ఓటమికి ప్రజలను నిందించే ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు మాత్రమే అని మండిపడ్డారు. టీడీపీకి భవిష్యత్తు లేదని నిర్థారణకు వచ్చిన […]

Advertisement
Update: 2019-08-08 08:33 GMT

పాలిచ్చే ఆవులాంటి తనను కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని ప్రజలను చంద్రబాబు విమర్శించడం పై వైసీపీ నేత సీ. రామచంద్రయ్య ఘాటుగా స్పందించారు. 2014లో ప్రజలు కూడా బాబును ఆవులాంటి వాడే అనుకున్నానని… కానీ ఐదేళ్ల పాలన చూసిన తర్వాత చంద్రబాబు ఒక దున్న అని ప్రజలకు అర్థం అవడం వల్లే ఎన్నికల్లో చిత్తుగా ఓడించారన్నారు. ఓటమికి ప్రజలను నిందించే ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు మాత్రమే అని మండిపడ్డారు.

టీడీపీకి భవిష్యత్తు లేదని నిర్థారణకు వచ్చిన అనేక మంది నేతలు వేరే పార్టీల్లోకి వెళ్తున్నారని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. బాబు ఎన్ని విన్యాసాలు చేసినా ఆ పార్టీ ఇక కోలుకోలేదని స్పష్టం చేశారు. మోడీని జగన్ కలిస్తే తనపై ఫిర్యాదు చేసేందుకే కలిసారంటూ మతిలేని మాటలు చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ప్రతిదానికీ చంద్రబాబు ఎందుకు అంతగా భయపడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన చంద్రబాబు అసలు చేయించు కోవాల్సిన మానసిక పరీక్షలు మరిచి పోయారని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. ఐదేళ్ల బాబు పాలన ప్రజలకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది అని విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News