ఇలాంటి తప్పుడు పనులు తగదు... వెంకయ్యపై స్పీకర్ ఘాటు వ్యాఖ్యలు

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీ ఫిరాయించగా వారిపై చర్యలు తీసుకోకపోవడాన్ని తమ్మినేని తప్పుపట్టారు. వెంకయ్యనాయుడు చేసిన పనిని ఎవరైనా ఖండించాల్సిందేనన్నారు. ఉప రాష్ట్రపతిగా ఉన్నతమైన స్థానంలో ఉన్న వారు ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదన్నారు. ఆదర్శవంతంగా ఉండాల్సిన వారే ఇలాంటి పనులు చేస్తే ఎలా అని నిలదీశారు. పార్టీ ఫిరాయింపులను ఎవరూ ప్రోత్సహించ కూడదని… ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వారు […]

Advertisement
Update: 2019-08-04 11:27 GMT

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీ ఫిరాయించగా వారిపై చర్యలు తీసుకోకపోవడాన్ని తమ్మినేని తప్పుపట్టారు.

వెంకయ్యనాయుడు చేసిన పనిని ఎవరైనా ఖండించాల్సిందేనన్నారు. ఉప రాష్ట్రపతిగా ఉన్నతమైన స్థానంలో ఉన్న వారు ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదన్నారు.

ఆదర్శవంతంగా ఉండాల్సిన వారే ఇలాంటి పనులు చేస్తే ఎలా అని నిలదీశారు. పార్టీ ఫిరాయింపులను ఎవరూ ప్రోత్సహించ కూడదని… ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వారు ఇలాంటి తప్పుడు పనులను అస్సలు ప్రోత్సహించకూడదని అభిప్రాయపడ్డారు.

వెంకయ్యనాయుడు స్థానంలో తానే ఉండి ఉంటే పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేసి ఉండేవాడినన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తుంటారని వ్యాఖ్యానించారు. ఏపీలో పార్టీలు ఫిరాయిస్తే తక్షణం వేటు వేసి తీరుతామన్నారు. ముఖ్యమంత్రి కూడా ఇదే విషయాన్ని చెప్పారన్నారు.

Tags:    
Advertisement

Similar News