ఏడు జిల్లాల్లో కత్తులు తీసుకుని తిరగడంపై నిషేధం

శాంతిభద్రతల విషయంలో ఏపీ పోలీస్ శాఖ పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. సున్నితమైన జిల్లాల్లో కత్తులు పట్టుకుని తిరగడంపై పోలీసులు నిషేధం విధించారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, అనంత, కడప, కర్నూలు, చిత్తూరుల్లో కత్తులు పట్టుకుని తిరగడం పై నిషేధం విధించారు. ఇప్పటికే ఉన్న ఆయుధాల నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టు పోలీసు శాఖ ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే జనవరి 15 వరకు ఈ నిషేధం కొనసాగుతుంది. […]

Advertisement
Update: 2019-07-09 00:01 GMT

శాంతిభద్రతల విషయంలో ఏపీ పోలీస్ శాఖ పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. సున్నితమైన జిల్లాల్లో కత్తులు పట్టుకుని తిరగడంపై పోలీసులు నిషేధం విధించారు.

ప్రకాశం, గుంటూరు, కృష్ణా, అనంత, కడప, కర్నూలు, చిత్తూరుల్లో కత్తులు పట్టుకుని తిరగడం పై నిషేధం విధించారు. ఇప్పటికే ఉన్న ఆయుధాల నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టు పోలీసు శాఖ ప్రకటించింది.

ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే జనవరి 15 వరకు ఈ నిషేధం కొనసాగుతుంది. ఆ తర్వాత మళ్ళీ నిర్ణయం తీసుకుంటారు.

Tags:    
Advertisement

Similar News