భగీరథుడు ఎన్టీఆర్‌.... అపర భగీరథుడు చంద్రబాబు

తెలుగు గంగ ప్రాజెక్టును ప్రారంభించి రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన భగీరథుడు ఎన్టీఆర్‌ అని…. పట్టిసీమ నీళ్ళు ఇచ్చి అనంతపురం జిల్లాలో చెరువులు నింపిన అపర భగీరథుడు చంద్రబాబు అని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మంగళవారం నాడు హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూల మాల వేసి నివాళులర్పించారు బాలకృష్ణ దంపతులు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు […]

Advertisement
Update: 2019-05-28 06:44 GMT

తెలుగు గంగ ప్రాజెక్టును ప్రారంభించి రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన భగీరథుడు ఎన్టీఆర్‌ అని…. పట్టిసీమ నీళ్ళు ఇచ్చి అనంతపురం జిల్లాలో చెరువులు నింపిన అపర భగీరథుడు చంద్రబాబు అని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మంగళవారం నాడు హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూల మాల వేసి నివాళులర్పించారు బాలకృష్ణ దంపతులు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ ప్రజలు జగన్‌కు ఓటేయడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు.

Tags:    
Advertisement

Similar News