కోట్ల విలువైన స్థలం కోసం... కేసీఆర్ సంతకం ఫోర్జరీ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కేసీఆర్ సంతకాన్ని ఉపయోగించి వారు మోసానికి పాల్పడినట్లు తెలియడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలోని అత్యంత ఖరీదైన రెండెకరాల భూమిని బదిలీ చేయడానికి సీఎం కేసీఆర్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ మోసంపై ఆర్డీవో పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ పిర్యాదుపై విచారణ చేపట్టిన మాదాపూర్ పోలీసులు ముగ్గురి నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. వీరి […]

Advertisement
Update: 2019-05-18 06:54 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కేసీఆర్ సంతకాన్ని ఉపయోగించి వారు మోసానికి పాల్పడినట్లు తెలియడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గచ్చిబౌలి ప్రాంతంలోని అత్యంత ఖరీదైన రెండెకరాల భూమిని బదిలీ చేయడానికి సీఎం కేసీఆర్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ మోసంపై ఆర్డీవో పోలీసులకు పిర్యాదు చేశారు.

ఈ పిర్యాదుపై విచారణ చేపట్టిన మాదాపూర్ పోలీసులు ముగ్గురి నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. వీరి వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Tags:    
Advertisement

Similar News