లోకేష్ కు ఓటా?... ఆత్మన్యూనతా భావంతో మంగళగిరి ప్రజలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ ఎన్నికల ప్రచారం కామెడీ షోగా మారింది. లోకేష్ చేస్తున్న ప్రసంగాలు, ఆయన హావభావాలను చూసి జనం నవ్వుకుంటున్నారు. రోజుకో చిత్రమైన వ్యాఖ్య చేస్తూ నవ్వుల పాలవుతున్నారు ఆయన. టీడీపీకి ఓటేస్తే నారా లోకేష్‌ తమ ఎమ్మెల్యే అని చెప్పుకోవాల్సి వస్తుందన్న ఆత్మన్యూనతా భావానికి మంగళగిరి ప్రజలు లోనయ్యేలా లోకేష్ చేస్తున్నారు. మంగళవారం మరోసారి లోకేష్ నోరు జారారు. దుగ్గిరాల మండలం చింతలపూడిలో జరిగిన సభలో లోకేష్ చేసిన వ్యాఖ్యతో… టీడీపీ కార్యకర్తలకు వడదెబ్బ కొట్టినంత పనైంది. గంజి చిరంజీవి […]

Advertisement
Update: 2019-04-02 21:28 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ ఎన్నికల ప్రచారం కామెడీ షోగా మారింది. లోకేష్ చేస్తున్న ప్రసంగాలు, ఆయన హావభావాలను చూసి జనం నవ్వుకుంటున్నారు. రోజుకో చిత్రమైన వ్యాఖ్య చేస్తూ నవ్వుల పాలవుతున్నారు ఆయన. టీడీపీకి ఓటేస్తే నారా లోకేష్‌ తమ ఎమ్మెల్యే అని చెప్పుకోవాల్సి వస్తుందన్న ఆత్మన్యూనతా భావానికి మంగళగిరి ప్రజలు లోనయ్యేలా లోకేష్ చేస్తున్నారు.

మంగళవారం మరోసారి లోకేష్ నోరు జారారు. దుగ్గిరాల మండలం చింతలపూడిలో జరిగిన సభలో లోకేష్ చేసిన వ్యాఖ్యతో… టీడీపీ కార్యకర్తలకు వడదెబ్బ కొట్టినంత పనైంది.

గంజి చిరంజీవి అన్నకు ఇచ్చిన మెజార్టీ నాకు ఇచ్చి గెలిపించండి అని పిలుపునిచ్చారు. నిజానికి గంజి చిరంజీవి గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన అభ్యర్థికి ఇచ్చినట్టు ఓట్లు ఇవ్వాలని లోకేష్ కోరడంతో టీడీపీ కార్యకర్తలు అంతా మౌనంగా ఉండిపోయారు. దాంతో నారా లోకేషే అడిగి మరీ వారితో చప్పట్లు కొట్టించుకున్నారు.

Tags:    
Advertisement

Similar News