ఉన్మాద ప్రేమికుడి దాడిలో గాయపడిన రవళి మృతి

తన ప్రేమను తిరస్కరించిందనే కోపంలో వరంగల్‌లో డిగ్రీ విద్యార్థిని రవళిపై పెట్రోల్ పోసి తగుల బెట్టిన ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. తొలుత ప్రథమ చికిత్స ఎంజీఎంలో అందించి వెంటనే సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆనాటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రవళి పరిస్థితి తీవ్ర విషమంగా మారి సోమవారం సాయంత్రం కన్నుమూసింది. పెట్రోల్ మంటల తీవ్రతకు శ్వాసనాళాలు పూర్తిగా కాలిపోవడంతో ఆమెకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో డాక్టర్లు కృత్రిమ శ్వాస […]

Advertisement
Update: 2019-03-04 08:56 GMT

తన ప్రేమను తిరస్కరించిందనే కోపంలో వరంగల్‌లో డిగ్రీ విద్యార్థిని రవళిపై పెట్రోల్ పోసి తగుల బెట్టిన ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. తొలుత ప్రథమ చికిత్స ఎంజీఎంలో అందించి వెంటనే సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.

కాగా, ఆనాటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రవళి పరిస్థితి తీవ్ర విషమంగా మారి సోమవారం సాయంత్రం కన్నుమూసింది. పెట్రోల్ మంటల తీవ్రతకు శ్వాసనాళాలు పూర్తిగా కాలిపోవడంతో ఆమెకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో డాక్టర్లు కృత్రిమ శ్వాస అందిస్తూ బతికించడానికి ప్రయత్నించినా చివరకు ఆమె జీవితం విషాదాంతం అయ్యింది.

సంగెం మండలానికి చెందిన రవళి, సాయిఅన్వేష్ కాకతీయ పాఠశాలలో కలసి చదువుకున్నారు. ఇంటర్ చదివే రోజుల్లో వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఆ తర్వాత కాలంలో రవళి అతడిని దూరం పెడుతూ వచ్చింది. తనకు ఇష్టం లేదని అతనితో చెప్పేసింది. దీంతో అన్వేష్ బెదిరింపులు ఎక్కువయ్యాయి.

ఈ విషయంపై రవళి తల్లిదండ్రులు వారి గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిపింది అన్వేష్‌ను హెచ్చరించారు. దీంతో ఆమెపై క్ష పెంచుకున్న అన్వేష్ గత నెల 27న హాస్టల్ నుంచి కళాశాలకు వెళ్తున్న రవళిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

Tags:    
Advertisement

Similar News