ఇట్లే ఉంటే కష్టం " జేసీ సంచలన వ్యాఖ్యలు

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం సరిగా లేదన్నారు. వీరితో ఎన్నిలకు వెళ్తే కష్టమన్నారు. కనీసం 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకుంటే చంద్రబాబు గెలుపు కష్టమే నన్నారు. ఎమ్మెల్యేలు వాళ్ళే కలెక్టర్లుగా, వాళ్ళే ఎస్పీలుగా వ్యవహరిస్తుంటే ఇక బాబును చూసి ఓట్లేసేది ఎవరు? అని జేసీ ప్రశ్నించారు. చంద్రబాబు మాత్రం తనను చూసి ఓట్లేస్తారని అనుకుంటున్నారని….. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోతే ఓట్లు పడవని […]

Advertisement
Update: 2019-03-02 05:02 GMT

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం సరిగా లేదన్నారు. వీరితో ఎన్నిలకు వెళ్తే కష్టమన్నారు.

కనీసం 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకుంటే చంద్రబాబు గెలుపు కష్టమే నన్నారు. ఎమ్మెల్యేలు వాళ్ళే కలెక్టర్లుగా, వాళ్ళే ఎస్పీలుగా వ్యవహరిస్తుంటే ఇక బాబును చూసి ఓట్లేసేది ఎవరు? అని జేసీ ప్రశ్నించారు.

చంద్రబాబు మాత్రం తనను చూసి ఓట్లేస్తారని అనుకుంటున్నారని….. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోతే ఓట్లు పడవని జేసీ కామెంట్స్ చేశారు.

సరిహద్దుల్లో పరిస్థితుల పైనా జేసీ స్పందించారు. భారత్-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఇలాగే ఉంటే మరోసారి మోడీ ప్రధాని అవడం ఖాయమన్నారు జేసీ.

Tags:    
Advertisement

Similar News