కడప స్టీల్ ప్లాంట్ పేరుతో 4వేల ఎకరాలు కొనుగోలు చేసిన టీడీపీ ఎంపీ

కడప స్టీల్ ప్లాంట్ పేరుతో చంద్రబాబు, ఆయన బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారని వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. మీడియాతో మాట్లాడిన ఆయన… కడప వద్ద స్టీల్‌ ప్లాంట్ కు శంకుస్థాపన పేరుతో  కావాలనే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. కడప జిల్లాలో ఎక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇటీవల కడప జిల్లా టీడీపీ నేతలు రెండుగా చీలిపోయిన నేపథ్యంలో ఆనం స్పందించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేస్తానంటున్న […]

Advertisement
Update: 2018-12-22 23:46 GMT

కడప స్టీల్ ప్లాంట్ పేరుతో చంద్రబాబు, ఆయన బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారని వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. మీడియాతో మాట్లాడిన ఆయన… కడప వద్ద స్టీల్‌ ప్లాంట్ కు శంకుస్థాపన పేరుతో కావాలనే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.

కడప జిల్లాలో ఎక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇటీవల కడప జిల్లా టీడీపీ నేతలు రెండుగా చీలిపోయిన నేపథ్యంలో ఆనం స్పందించారు.

కడప స్టీల్‌ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేస్తానంటున్న చోట చంద్రబాబుకు బినామీ అయిన టీడీపీ ఎంపీ ఏకంగా నాలుగు వేల ఎకరాలు కొనుగోలు చేసింది నిజం కాదా అని ఆనం ప్రశ్నించారు. ఆ నాలుగు వేల ఎకరాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే ఇప్పుడు చంద్రబాబు, ఆయన బినామీ ఎంపీ స్టీల్ ప్లాంట్‌ నాటకం మొదలుపెట్టారన్నారు.

చంద్రబాబు బ్రిటీష్ వారి కంటే దారుణంగా తయారయ్యారని… చివరకు తిరుపతి పేరును మారుస్తామని చంద్రబాబు చెబుతున్నారంటే దాన్ని ఏమనుకోవాలన్నారు ఆనం. ఎదుగుదలకు కారణమైన తిరుపతి పైనే చంద్రబాబుకు ఎందుకంత కోపం అని ప్రశ్నించారు. తిరుపతిని సిలికాన్ సిటీగా పేరు మారిస్తే దేవుడు కూడా క్షమించరన్నారు ఆనం.

Tags:    
Advertisement

Similar News