జనసేన ఎన్నికల గుర్తు గ్లాసు

సినీ నటుడు పవన్‌ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు వచ్చింది. పార్టీ స్థాపించి  చాలా కాలం అయినా ఎన్నికల గుర్తు లేదు అంటూ వ్యాఖ్యానాలు వచ్చేవి. ఎట్టకేలకు ఈసీ జనసేనకు ఎన్నికల గుర్తు కేటాయించింది. గాజు గ్లాసు జనసేన గుర్తు. టీ గాజు గ్లాసు సింబల్‌ను జనసేనకు కేటాయించినట్టు ఆ పార్టీ వెల్లడించింది. గుర్తును జనంలోకి తీసుకెళ్లాలని అభిమానులను ఆ పార్టీ కోరింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ […]

Advertisement
Update: 2018-12-22 21:02 GMT

సినీ నటుడు పవన్‌ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు వచ్చింది. పార్టీ స్థాపించి చాలా కాలం అయినా ఎన్నికల గుర్తు లేదు అంటూ వ్యాఖ్యానాలు వచ్చేవి.

ఎట్టకేలకు ఈసీ జనసేనకు ఎన్నికల గుర్తు కేటాయించింది. గాజు గ్లాసు జనసేన గుర్తు. టీ గాజు గ్లాసు సింబల్‌ను జనసేనకు కేటాయించినట్టు ఆ పార్టీ వెల్లడించింది.

గుర్తును జనంలోకి తీసుకెళ్లాలని అభిమానులను ఆ పార్టీ కోరింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుంది.

ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్… సంక్రాంతి తరువాత పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడంతో పాటు అమరావతిలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల గుర్తు కూడా రావడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News