సంచలన నిర్ణయం తీసుకున్న గరికపాటి....

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్తగా ప్రవచనాలు చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇకపై కొత్తగా ప్రవచన కార్యక్రమాలకు తనను ఆహ్వానించ వద్దని కోరారు. ఇప్పటికే అంగీకరించిన కార్యక్రమాలను మాత్రమే కొనసాగిస్తానని…. వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తానని ప్రకటించారు. 1993 నుంచి ప్రవచనాలు చెబుతున్నానని…. ఏడాదిగా తన మనసు మౌనాన్ని కోరుకుంటోందన్నారు. అందుకే కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఇకపై ప్రవచన కార్యక్రమాలు […]

Advertisement
Update: 2018-11-27 00:35 GMT

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్తగా ప్రవచనాలు చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇకపై కొత్తగా ప్రవచన కార్యక్రమాలకు తనను ఆహ్వానించ వద్దని కోరారు. ఇప్పటికే అంగీకరించిన కార్యక్రమాలను మాత్రమే కొనసాగిస్తానని…. వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తానని ప్రకటించారు.

1993 నుంచి ప్రవచనాలు చెబుతున్నానని…. ఏడాదిగా తన మనసు మౌనాన్ని కోరుకుంటోందన్నారు. అందుకే కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఇకపై ప్రవచన కార్యక్రమాలు చేయకూడదని నిర్ణయించుకున్నానన్నారు.

టీవీల్లో గానీ, వేదికపై గానీ ప్రవచనలు చెప్పబోనన్నారు. ఇప్పటి వరకు ఒప్పుకున్నవి మాత్రమే పూర్తిచేస్తానన్నారు. ఇంట్లోనే మౌనంగా, ఏకాంతంగా ఉంటూ తనను తాను తెలుసుకోవాలనుకుంటున్నానని వివరించారు. వేషం బాగుండగానే వేదిక దిగిపోవాలన్నది తన ఉద్దేశమన్నారు.

ఈ విషయంలో నటుడు శోభన్‌బాబు తనకు ఆదర్శమన్నారు. శోభన్‌బాబు హీరోగా మంచి స్థాయిలో ఉన్నప్పుడే సినిమాలను మానేసి ఆనందంగా జీవించారని చెప్పారు గరికపాటి. కొత్తగా తనను ప్రవచనాలు చెప్పాల్సిందిగా ఎవరూ ఒత్తిడి చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:    
Advertisement

Similar News